Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరులో నీట్‌కు మరో విద్యార్థిని బలవన్మరణం

NEET
Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (13:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో నీట్ పరీక్ష మరో విద్యార్థి ప్రాణాలు తీసింది. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. దీంతో ఓ విద్యార్థి ఉత్తీర్ణతపై భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
కోయంబత్తూరు జిల్లా పుదూర్‌కుప్పంకు చెందిన కుప్పుస్వామి-వలర్మతి దంపతుల కుమారుడు కీర్తివాసన్‌ (20) ప్లస్‌ టూ ముగించి రెండుసార్లు నీట్‌ రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గత సెప్టెంబరులో జరిగిన నీట్‌కు కూడా హాజరయ్యాడు. 
 
అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న కీర్తివాసన్‌.. మరికొద్ది రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఆతర్వాత తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 
 
తల్లి ఇంటికి చేరుకుని చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కుతూ కీర్తివాసన్‌ కనిపించాడు. దీంతో అతడిని తొలుత పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి కోయంబత్తూరు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments