Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యం తారుమారు... ఆస్పత్రికి రూ.1.5 కోట్ల అపరాధం... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (13:41 IST)
కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు తన భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఎక్కించిన ఆస్పత్రికి జాతీయ వినియోగదారుల ఫోరం భారీ అపరాధం విధించింది. ఈ కేసులో ఏకంగా రూ.1.5 కోట్ల ఫైన్ చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం షాక్‌కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతాన భాగ్యం పొందేందుకు సదరు ఆస్పత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత శిశువులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ పిల్లల తండ్రి మరొకరని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది చేసిన పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటానికి దిగారు. 
 
తమకు సదరు ఆస్పత్రి రూ.2 కోట్ల అపరాధం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ కేసుపై కొన్నేళ్లపాటు సుధీర్ఘ విచారణ జరిగింది. చివరకు బాధితులకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేనా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయపడింది. అయితే ఈ పొరపాటు చేసిన ఆస్పత్రి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments