Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తెపై కేసు నమోదు.. తండ్రే పెట్టించారంటున్న కుమార్తె

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (13:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమి ఫెన్సింగ్‌ను భవానీ కూల్చివేశారంటూ పక్క స్థల యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీనిపై తుల్జా భావనీ స్పందిస్తూ, తన తండ్రే ఆయనతో కేసు పెట్టించారని ఆరోపిస్తున్నారు.
 
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డికి, ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో 1270 గజాల స్థలం చుట్టూత ఉన్న ఫెన్సింగ్‌ను తుల్జా భవానీ సోమవారం కూల్చివేశారు. తన పేరుమీద ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ఆమె కూల్చేవేశామని చెబుతున్నారు. 
 
పైగా, చేర్యాల మున్సిపాలిటీకి తన భూమిని అప్పగించనున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే, ఆ భూమి పక్కన ఉన్న తన భూమి ఫెన్సింగ్‌ను కూడా భవానీ కూల్చివేశారంటూ పక్క స్థల యజమాని రాజు భాయ్ చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా చేసుకుని తుల్జా భవానీపై పోలీసులు నమోదు చేశారు. దీనిపై భవానీ స్పందిస్తూ, తన తండ్రి ఒత్తిడి రాజు భాయ్ తనపై ఫిర్యాదు చేసి, పోలీసులు కేసు పెట్టేలా చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments