కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ సురక్షితం.. ఫోటో రిలీజ్ చేసిన మావోలు

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:42 IST)
మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఫోటోను మావోయిస్టులు తాజాగా విడుదల చేశారు.  
 
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ - సుక్మా అటవీప్రాంతంలో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో రాకేశ్వర్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో‌ గల్లంతయ్యారు. ఆయనను మావోలు బందీగా ఉంచున్నారు.
 
అయితే, ఆయన ఆచూకీపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకేశ్వర్ సింగ్ తమ అధీనంలోనే సురక్షితంగా ఉన్నాడని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటించారు. 
 
తాజాగా రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఉన్నాడంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. ఓ చిన్న తాటాకుల పాకలో విశ్రాంతి తీసుకుంటున్న కమాండో ఆ ఫొటోలో దర్శనమిచ్చాడు. 
 
రాకేశ్వర్ సింగ్ ఎవరితోనో మాట్లాడుతుండగా ఫొటోను క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది. అతడి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించకపోవడాన్ని బట్టి మావోలు బాగానే చూసుకుంటున్నారని తెలుస్తోంది. 
 
పోలీసులు తమ శత్రువులు కారని, ప్రభుత్వ విధానాలనే తాము వ్యతిరేకిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పైగా, రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments