Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో కీలక పరిణామం... పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:08 IST)
పంజాబ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేందుకు హస్తినకు వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. 
 
నిజానికి వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. 
 
తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి పంపించారు. 
 
పంజాబ్‌లో సిద్దూ వర్సెస్ కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. సిద్దూతో దేశానికి ముప్పు ఉందని, అతనికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 
 
అదేసమయంలో ఇపుడు ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments