Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానని మహిళపై పార్కింగ్ చేసిన బస్సులో బలాత్కారం!

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:43 IST)
దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చి అమలు చేస్తున్నా వాటివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. మహారాష్ట్రలో తాజాగా 19 యేళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కూడా ఆమె స్నేహితులే కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నవీ ముంబైలోని ఖర్గార్‌కు చెందిన 19 యేళ్ళ యువతికి బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానని ఇద్దరు స్నేహితులు నమ్మించారు. దీంతో వారి మాటలు నమ్మి బైక్ నేర్చుకునేందుకు వెళ్ళింది. అయితే, ఆ యువతిని ఖర్గార్‌లోని ఉత్కర్ష్ హాలు సమీపంలో ఆపి ఉంచిన బస్సులోకి తీసుకువచ్చాడు. 
 
అక్కడ ఆ యువతితో బలవంతంగా మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పిజ్జా డెలివరీ బాయ్‌ను కూడా పిలిపించాడు. డెలివరీ బాయ్ కూడా మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళను బస్సులోనే వదిలి పారిపోయారు. 
 
బాధిత మహిళ మరుసటిరోజు విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన పిజ్జా డెలివరీ బాయ్‌ను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు డ్రైవరు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments