Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బస్సులో యువతిపై అత్యాచారం.. డ్రైవర్‌తో పాటు పిజ్జా డెలివరీ బాయ్?

Advertiesment
19-year-old
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:28 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. నవీ ముంబైలోని ఖర్గార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరు డ్రైవర్ కాగా, మరొకరు పిజ్జా డెలివరీ బోయ్ అని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. బైక్ డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్పి సదరు యువతిని డ్రైవర్ తీసుకొచ్చాడు. తనతో పాటే మద్యం కూడా తీసుకొచ్చిన అతను... ఆమెకు బలవంతంగా మద్యం తాగించి బస్సులోనే అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన పిజ్జా డెలివరీ బోయ్‌ని కూడా పిలిపించాడు.
 
పిజ్జా డెలివరీ బోయ్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆమెను బస్సులోనే వదిలి పారిపోయారు. మరుసటి రోజు ఈ దారుణంపై కుటుంబసభ్యులతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. పిజ్జా డెలివరీ బోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త లేబర్ కోడ్ వస్తే.. వారానికి నాలుగు రోజులే పని చేయాలా?