Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రోజున 10 గంటలు.. రెండో రోజున 4 గంటలు.. రాహుల్ వద్ద ఈడీ విచారణ

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (17:00 IST)
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు రాహుల్ గాంధీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు రోజుల పాటు విచారణ జరిపారు. తొలి రోజైన సోమవారం ఏకంగా 10 గంటల పాటు విచారణ జరిపిన ఈడీ అధికారులు రెండో రోజైన మంగళవారం నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు రాహుల్ లిఖిత పూర్వకంగానే సమాధానమిచ్చినట్టు సమాచారం. 
 
మరోవైపు, మంగళవారం ఉదయం 11.05 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ దాదాపు 4 గంటలకు పైగా విచారణ తర్వాత బయటకు వచ్చారు. అయితే, ఆయన తిరిగి ఈడీ కార్యాలయానికి వస్తారా? లేదంటే ఈడీ విచారణ ముగిసిందా? అనే విషయంలో మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. మరోవైపు, ప్రియాంకా గాంధీ రాహుల్ నివాసానికి చేరుకున్నట్టు సమాచారం.
 
సోమవారం దాదాపు పది గంటల పాటు విచారించి రాహుల్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఈడీ అధికారులు.. మంగళవారం కూడా హాజరు కావాలని సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉదయం తన నివాసం నుంచి తొలుత కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న రాహుల్‌.. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు.
 
రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ రెండో రోజు కూడా కాంగ్రెస్‌ శ్రేణులు ఢిల్లీలో నిరసనలు తెలిపాయి. జన్‌పథ్‌ వద్ద నిరసన తెలిపిన ఆ పార్టీ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, అధిర్‌ రంజన్‌ చౌధురి, గౌరవ్‌ గగొయ్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, రంజీత్‌ రంజన్‌, ఇమ్రాన్‌ ప్రతాప్‌ గ్రహి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని బాదార్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments