Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు మళ్లీ ఈడీ ముందుకు రాహుల్ - తొలి రోజు 10 గంటల విచారణ

rahul gandhi
, మంగళవారం, 14 జూన్ 2022 (07:35 IST)
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రెండో రోజైన మంగళవారం కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆయన వద్ద తొలి రోజున 10 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరిపారు. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రివరకు జరిగింది. తొలి రోజు విచారణ పూర్తి చేసుకుని ఈడీ కార్యాలయం నుంచి రాత్రి 9.30 గంటలకు బయటకు వచ్చారు. అంటే తొలి రోజున మొత్తం 10 గంటల పాటు విచారణ ఆయన వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
తొలి రోజున సుధీర్ఘంగా సాగిన విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు రాహుల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చినట్టు సమాచారం. అంటే ఈ లిఖిత పూర్వక సాక్ష్యాధారాలుగా ఈడీ అధికారులు పరిగణించే దిశగా ఈడీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 
 
అంతేకాకుండా, రెండో రోజైన మంగళవారం కూడా ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారణకు రావాలని ఆదేశించారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత ఈ మేరకు వారు రాహుల్‌కు స్వయంగా సమన్లు అందజేశారు. ఫలితంగా ఆయన మంగళవారం కూడా ఈడీ కార్యాలయానికి రానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమతాస్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసం ఒక్కసారిగా రూ.50 పెంపు