Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్‌కు పొగాకు సెగ... ఆ ప్రచారం నుంచి తప్పుకోండంటూ లేఖ

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:54 IST)
బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు సెగతగిలింది. పాన్ మసాలా ప్రచార ప్రకటన నుంచి వైదొలగాలంటూ నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనేషన్ (జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ) ఘాటైన లేఖను సంధించింది. 
 
పొగాకు, పాన్ మసాలా వ్యసనం పౌరుల ఆరోగ్యాన్ని క్షీణిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలిందని, అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనల ప్రచారం నుంచి వైదొలగాలని కోరుతూ ఈ సంస్థ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్‌కు లేఖ రాశారు.
 
ఈ లేఖలో... 'అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని, అతను వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలి. పొగాకు వ్యసనం నుంచి యువత దూరంగా ఉండటానికి ఈ చర్య సహాయపడుతుంది' అని పేర్కొన్నారు. 
 
'పాన్ కేన్సర్ కారకంగా పనిచేస్తోందని ఇటీవలి పరిశోధనలో తేలింది, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్‌కు దారితీస్తాయని తేలింది. పాన్ మానవులకు కేన్సర్ కారకం అనే శాస్త్రీయ ఆధారాలను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్దారించాయి' అని బిగ్ బి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments