అమ్మకానికి భారత్ : రాహుల్ గాంధీ ధ్వజం

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (08:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని కాగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాలను పూర్తి విక్రయానికి కేంద్రం నిర్ణయించిందని వచ్చిన వార్తలపై రాహుల్ సోమవారం ఘాటుగా స్పందించారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపాకు ఎలా నిర్మించాలో తెలియదు గానీ, ఎలా అమ్మాలో మాత్రం పూర్తి అవగాహన ఉందంటూ ట్విటర్‌‌ వేదికగా ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ ఆప్తమిత్రులు మాత్రమే లబ్ధి పొందుతారని విమర్శించారు. #IndiaAgainstPrivatisation అనే హ్యష్‌ట్యాగ్‌ జోడించారు.
 
అనేక అంశాలపై ప్రధాని మోడీ సర్కారును రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబడుతున్న విషయం తెల్సిందే. ఇపుడు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ఆయన రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments