Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ.. కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం..

Webdunia
శనివారం, 25 మే 2019 (20:01 IST)
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును తొలుత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదించగా, ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాంవిలాస్ పాశ్వాన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామిలు బలపరిచారు. ఆ తర్వాత ఎన్డీయే కూటమి తరపున ఎంపికైన ఎంపీలంతా బల్లలు చరుస్తూ మోడీ పేరును బలపరిచారు. 
 
శనివారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న సెంట్రల్ హాలులో జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, బీజేపీ చీఫ్ అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిల, ఎన్డీయే భాగస్వామ్యపక్షాల నేతలు హాజరయ్యారు. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 17వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, ఆధునిక భారత్ దిశగా మనం ప్రయాణం ప్రారంభించరు. ఈ ప్రయాణంలో మీరంతా ఎంతో బాగా సహకరించారు. గత ఐదేళ్ళలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం.  ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈ సారికూడా కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. భారత ప్రజాస్వామ్యం ఉన్నతి దిశగా పయనిస్తోందన్నారు. ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా సేవా భావం మాత్రం మర్చిపోరాదని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికలు భాజపాకు సానుకూలంగా ఉన్నాయి. మనపై ఈ అనుకూలధోరణి అనేది నమ్మకం అనే దారంతో ముడివేసి ఉంది. ఈ నమ్మకం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండడమే కాదు.. సాధారణంగా జనంలోనూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ఎంపీలందరికీ, వారి విజయం కోసం కృషి చేసిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం విజయవంతంగా నిర్వహించిందని మోడీ కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments