Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటే కరోనా వస్తుందా.. నిరూపిస్తే కోటి రూపాయలిస్తాం..?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (15:03 IST)
కరోనాతో ప్రస్తుతం ప్రపంచమంతా గజగజలాడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చికెన్ తినాలంటేనే జనం జడుసుకుంటున్నారు. దీంతో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు బంపరాఫర్ ప్రకటించారు. కోడిగుడ్లు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుంది నిరూపిస్తే రూ.కోటి రూపాయలు బహుమతి అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్‌ సొసైటీ సంయుక్తంగా వెల్లడించాయి. 
 
కరోనా వైరస్ దెబ్బకు కోడిగుడ్లు, చికెన్ ధరలు పడిపోయిన తరుణంలో పౌల్ట్రీకి పాపులరైన నామక్కల్‌లో కోళ్ల ఫారం యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీనితో కోడి గుడ్డు ధర రూ. 1.3 పడిపోగా, కోడి మాంసం రూ. 20కి తగ్గింది. 
 
ఇది కూడా కేవలం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతుల వల్లే జరిగిందని అక్కడి రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికెన్ తినడంతో వస్తుందని నిరూపిస్తే కోటి రూపాయలు ఆఫర్ ఇస్తామని పౌల్ట్రీ రైతులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments