Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా వున్న యువతి.. గట్టిగా అరుపులు.. పెళ్లైన 8 నెలల్లోనే?

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (15:11 IST)
తమిళనాడు నాగర్‌కోయిల్ సమీపంలో పెళ్లై ఎనిమిదో నెలలో ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కోయిల్ కాట్రాడితట్టు ప్రాంతానికి చెందిన శివన్ (28) భార్య అర్చన (24). ఈమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ ఇంట్లోనే పెరిగింది. మేనమామ చేతుల మీదుగానే అర్చనకు శివన్‌తో వివాహం జరిగింది. 
 
అయితే అర్చనకు, శివన్‌కు మధ్య పెళ్లైనప్పటి నుంచి గొడవలు జరిగేవి. సోమవారం కూడా వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. మంగళవారం అలా శివన్ ఉద్యోగానికి వెళ్లడంతో.. అతని ఇంట ఉన్నట్టుండి పెద్దగా అరుపులు శబ్ధం వినబడింది. వెంటనే ఇరుగుపొరుగు వారు వెళ్లి చూసేలోపు.. అర్చన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
 
కానీ అక్కడ ఆమెను పరిశోధించిన వైద్యులు అర్చన మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పెళ్లై 8 నెలల్లోపే అర్చన ఈ అకృత్యానికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments