Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడం లేదు : రజినీకాంత్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్థికి తాను మద్దతు ఇవ్వడం లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ స్థానాని

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (11:11 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్థికి తాను మద్దతు ఇవ్వడం లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఈయన ఇటీవల రజినీకాంత్‌ను కలిశారు. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గంగై అమరన్‌కు రజినీకాంత్ మద్దతు ఇస్తున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి.
 
వీటిపై రజినీకాంత్ గురువారం ట్విట్టర్‌లో స్పందించారు. ఆర్కేనగర్‌లో బీజేపీ అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఏ ఒక్కరికీ మద్దతు ఇవ్వడం లేదని తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments