Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉత్పల్ పారికర్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (12:14 IST)
గోవా అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. దీంతో ఈ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారీకర్‌ తనయుడు ఉత్పల్ మనోహర్‌కు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పనాజీ నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, తనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వనందుకే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్టు చెప్పారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ భాజపాలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో తన పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీలపై కాదని ఒక్క బీజేపీపైనే అని చెప్పారు. కాగా, ఆయన పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు ఆయన నామినేషన్ దాఖలు చేసే ముందు మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
తన తండ్రి పోటీ చేసి గెలిచిన పనాజీ నుంచి పోటీ చేసి గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని భావించాను. కానీ, కమలనాథులు తనకు టిక్కెట్ నిరాకరించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ మాజీ నేత అటానాసియో బాబూష్‌కు మాన్ సెరాటేకు టిక్కెట్ కేటాయించింది. పార్టీ నమ్ముకున్న వారికంటే వలస వచ్చినవారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments