Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై నిప్పెట్టి చంపేశారు..

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (14:47 IST)
బీహార్‌లో 12 ఏళ్ల బాలికపై ఘోరం జరిగింది. కామాంధులు రెచ్చిపోయి.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా ఆమెను నిప్పెట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన కూలీ కార్మికుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. జనవరి 3వ తేదీ ఈ కూలీ కార్మికుడు ఇంట్లో లేని సమయంలో నలుగురు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. 12 ఏళ్ల కూలీ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అదే గదికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
తన కుమార్తెపై జనవరి 3 తేదీనే కాకుండా.. డిసెంబర్ 23వ తేదీనే అత్యాచారం జరిగిందని.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. ఆ వీడియోతో బెదిరింపులకు గురిచేసారని.. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి రోదిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో వున్న నలుగురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments