Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (13:05 IST)
ఇటీవల ఇంటి నుంచి తప్పిపోయిన అక్కా చెల్లెళ్లు ఇపుడు అనుకోని విధంగా దంపతులుగా ఇంటికి తిరిగి వచ్చారు. పైగా, తాము ఇక నుంచి భార్యాభర్తలుగా జీవించాలని అనుకుంటున్నామని చెప్పేసరికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల ఓ యువతి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె కోసం గాలించసాగారు. ఈ క్రమంలో ఆ యువతి తన సోదరి వరుసైన మరో యువతిని వివాహం చేసుకుని, ఇక నుంచి తాము దంపతులుగా జీవించాలని అనుకుంటున్నట్టు చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. 
 
తాను వరుడుగా మారి తన చెల్లిని వివాహం చేసుకున్నట్టు సదరు యువతి పోలీసులకు చెప్పింది. యేడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని కుటుంబ సభ్యులకు తమ ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయి వివాహం చేసుకున్నట్టు చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్లాలని వారిని ఒప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరువురూ తమ మనసు మార్చుకోవడానికి నిరాకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments