Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ సంగమ్ విహార్‌లో తివాచీలో మృతదేహం.. కాళ్లు నరికేసి.. విడివిడిగా పారేశారు..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ తివాచీ మూటకట్టి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో ఉన్న స

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (12:58 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ తివాచీ మూటకట్టి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజిని తాము పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. తివాచీలో మృతదేహాన్ని గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని, దాని భాగాలను విడివిడిగా పారేయడం కనిపించిందని డీసీపీ రోమిల్ బానియా తెలిపారు. 
 
హంతకులు అతడి గొంతు కోసేశారు. అతడి ముఖం మీద ఏదో ఒక బరువైన వస్తువుతో కొట్టారు. ముఖంలో కూడా కొంత భాగాన్ని చెక్కేశారు. మృతదేహాన్ని మూట కట్టడానికి వీలుగానే కాళ్లు నరికేసి ఉంటారని పోలీసులు చెప్పారు. 
 
మృతుడి వయసు సుమారు 35 ఏళ్ల ప్రాంతంలో ఉంటుందని, అతడు తెల్ల షర్టు, లుంగీ ధరించి ఉన్నాడని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి, మృతదేహాన్ని పడేసినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. అయితే నిందితుల ముఖాలు గానీ, ఆటో నంబరు ప్లేటు గానీ స్పష్టంగా కనిపించలేదు. ముందుగానే ఎక్కడో హత్యచేసి, మృతదేహాన్ని సంగమ్ విహార్ వద్ద పారేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments