Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలోకి వెళ్లాడని చావకొట్టారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (10:11 IST)
మంచినీరు తాగేందుకు ఆలయంలోకి ప్రవేశించాడన్న కారణంతో ముస్లిం బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసి చావకొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. 

ఆ వీడియోలో బాలుడిని ఒక వ్యక్తి ఏమాత్రం దయలేకుండా చితకబాదడం కనిపించింది. 'నీ పేరు ఏంటి.. నీ తండ్రి పేరు ఏంటి?' అని అడగ్గా ఆ బాలుడు చెప్పిన సమాధానంతో అతను ముస్లిం అని తెలుస్తోంది. ఆలయంలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా.. మంచి నీరు తాగేందుకు వచ్చానని ఆ బాలుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది.

ఆ తరువాత బాలుడిని కొట్టడం ప్రారంభించిన వ్యక్తి.. చేయి మెలితిప్పడంతో పాటు పలుమార్లు బాలుడి తలపై తన్నాడు. కింద పడినా కొట్టడం ఆపలేదు.

బాలుడిని కొట్టిన వ్యక్తిని బీహార్‌లోని భగల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన శ్రింగి నందన్‌ యాదవ్‌గా గుర్తించి, అరెస్టు చేసినట్లు ఘజియాబాద్‌ పోలీసులు తెలిపారు. నిరుద్యోగి అయిన నిందితుడు మూడు నెలలుగా ఆలయంలోనే నివాసం ఉంటున్నాడని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments