Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకేకు షాక్ : బీజేపీలో చేరిన మరో డీఎంకే ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (09:50 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఇప్పటికే థౌజెండ్‌ లైట్స్‌ నియోజకవర్గం డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం భాజపాలో చేరగా.. తాజాగా అదే పార్టీకి చెందిన తిరుప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే పి.శరవణన్‌ ఆదివారం భాజపా తీర్థం పుచ్చుకున్నారు. 
 
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎల్‌. మురుగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. జిల్లా స్థాయి పార్టీ కార్యవర్గాల ఆధిపత్యం.. వేధింపుల కారణంగానే తాను డీఎంకే పార్టీని వీడుతున్నట్లు శరవణన్‌ తెలిపారు. 
 
కొన్నేళ్ల కిందట భాజపాలోనే ఉన్న ఆయన ఆ తర్వాత డీఎంకేలో చేరారు. 2019లో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని చూస్తోన్న తరుణంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. 
 
కాగా, శరవణన్ పార్టీ వీడటానికి మరో కారణం ఉంది. కూటమి పొత్తుల్లో భాగంగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాన్ని మిత్రపక్షాలకు కేటాయించారు. దీంతో ఈ దఫా తనకు పోటీ చేసే అవకాశం రాదని గ్రహించిన శరవణన్ ముందు జాగ్రత్తగా బీజేపీ కండువా కప్పుకుని, ఇపుడు మళ్లీ బరిలోకి దిగుతున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments