Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగాలాండ్ పౌరులపై ఉద్దేశ్వపూర్వకంగా కాల్పులు!!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:54 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌ రాష్ట్రంలోని మోను జిల్లా థిరు, ఒటింగ్ గ్రామాల్లో తీవ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. అలాగే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ పౌరులపై భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపారంటూ స్థానికులు ఆరోణలు చేస్తున్నారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపేందుకు నాగాలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపినట్టు వెల్లడైంది. 
 
దీంతో కాల్పులు జరిపిన 15 మంది సైనికులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు చనిపోయిన మేజర్ కూడా ఉన్నారు. స్థానికులను గాయపర్చడం లేదా చంపివేయాలనే కారణంతోనే ఆర్మీ జవాన్లు ఈ కాల్పులకు తెగబడినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments