Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో డెల్టా కలకలం.. వేరియంట్ సోకి 63 ఏళ్ల వృద్ధురాలు మృతి

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:08 IST)
మహారాష్ట్రలో ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌.. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. వేగంగా విస్తరిస్తూ ప్రాణాలు మింగేస్తోంది. ముంబైలో డెల్టాప్లస్‌ ఫస్ట్‌ డెత్‌ నమోదైంది. డెల్టాప్లస్‌ వేరియంట్‌ సోకి 63 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. దీంతో మహారాష్ట్రలో డెల్టాప్లస్‌ బలితీసుకున్న వారి సంఖ్య రెండుకు పెరిగింది. జూన్‌లో రత్నగిరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కూడా డెల్టాప్లస్‌ వేరియంట్‌తోనే చనిపోయింది.
 
ముంబై ఈస్టర్న్‌ సబర్బ్‌కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలికి జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్షలు చేయించుకుంది. జూలై 21న ఆమెకు కరోనా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో జూలై 24న ఆమెను ఐసీయూలో చేర్చారు వైద్యులు. మూడు రోజుల చికిత్స అనంతరం 27న ఆమె మృతి చెందింది. మరణానంతరం ఆమెకు డెల్టాప్లస్‌ వేరియంట్‌గా గుర్తించారు అధికారులు. 
 
ఆగస్ట్‌ 11న ఈ విషయాన్ని బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు వైద్యాధికారులకు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఇద్దరికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఎటాక్‌ అయినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మృతి చెందిన వృద్ధురాలు రెండు డోసులు వేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments