Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం.. డ్రైనేజీలో నగ్నంగా వేశ్య శవం.. జననాంగాల వద్ద..?

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:45 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం జరిగింది. డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. ఒంటిపై దుస్తులు లేవు. జననాంగాల వద్ద గాయాలు కనిపించాయి. ఆమెను రేప్ చేసి.. గొంతుకోసి.. చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. 
 
ఎంతో బిజీగా ఉండే ఎంటీఎన్ఎల్ జంక్షన్ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ధనవంతులు ఎక్కుగా నివసించే బాంద్రా ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు.
 
వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గొంతుకోసి ఆమెను చంపేశారు. జననాంగాలపై తీవ్రంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
సెక్షన్‌ 376, 302 కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన మహిళ వేశ్యగా ప్రాథమికంగా భావిస్తున్నారు. నగదకు సంబంధించి గొడవ జరిగి ఉండవచ్చని.. ఈ క్రమంలోనే ఆమె వద్దకు వెళ్లిన విటులు, చంపేసి ఉండవచ్చని ప్రాథమికంగా తెలిపారు. నిందితులు దొరికిన తర్వాత ఈ హత్య కేసుపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments