Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం.. డ్రైనేజీలో నగ్నంగా వేశ్య శవం.. జననాంగాల వద్ద..?

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:45 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం జరిగింది. డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. ఒంటిపై దుస్తులు లేవు. జననాంగాల వద్ద గాయాలు కనిపించాయి. ఆమెను రేప్ చేసి.. గొంతుకోసి.. చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. 
 
ఎంతో బిజీగా ఉండే ఎంటీఎన్ఎల్ జంక్షన్ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ధనవంతులు ఎక్కుగా నివసించే బాంద్రా ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు.
 
వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గొంతుకోసి ఆమెను చంపేశారు. జననాంగాలపై తీవ్రంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
సెక్షన్‌ 376, 302 కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన మహిళ వేశ్యగా ప్రాథమికంగా భావిస్తున్నారు. నగదకు సంబంధించి గొడవ జరిగి ఉండవచ్చని.. ఈ క్రమంలోనే ఆమె వద్దకు వెళ్లిన విటులు, చంపేసి ఉండవచ్చని ప్రాథమికంగా తెలిపారు. నిందితులు దొరికిన తర్వాత ఈ హత్య కేసుపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments