Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టాల్లోనూ కల్తీ ... వాడేసిన మాస్కులను ఉతికి - ఇస్త్రీచేసి...

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:22 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యాపారులు కరోనా కష్టకాలంలో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. వాడేసిన మాస్కులను శుభ్రంగా ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి తిరిగి విక్రయిస్తున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మాస్కుల్లో కూడా కల్తీకి పాల్పడుతున్నారు. 
 
తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన ముగ్గురు దుండగులు.. వాడేసిన ఎన్95 మాస్కులను సేకరించి, ఉతికి ఇస్త్రీ చేసి మళ్లీ విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి వీరి వద్ద నుంచి 25వేలపైగా సెకండ్ హ్యాండ్ ఎన్95 మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటి విలువ రూ.50లక్షలపైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముగ్గురు నిందితులపై నిత్యావసరాల చట్టం, ఎపిడెమిక్స్ చట్టం, కొవిడ్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. కాగా, కోవిడ్ 19 బారినపడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments