Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టాల్లోనూ కల్తీ ... వాడేసిన మాస్కులను ఉతికి - ఇస్త్రీచేసి...

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:22 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యాపారులు కరోనా కష్టకాలంలో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. వాడేసిన మాస్కులను శుభ్రంగా ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి తిరిగి విక్రయిస్తున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మాస్కుల్లో కూడా కల్తీకి పాల్పడుతున్నారు. 
 
తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన ముగ్గురు దుండగులు.. వాడేసిన ఎన్95 మాస్కులను సేకరించి, ఉతికి ఇస్త్రీ చేసి మళ్లీ విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి వీరి వద్ద నుంచి 25వేలపైగా సెకండ్ హ్యాండ్ ఎన్95 మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటి విలువ రూ.50లక్షలపైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముగ్గురు నిందితులపై నిత్యావసరాల చట్టం, ఎపిడెమిక్స్ చట్టం, కొవిడ్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. కాగా, కోవిడ్ 19 బారినపడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments