Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావు బతుకుల్లోనూ లైంగిక వేధింపులు... శవాలపై నగలు చోరీ

ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు స్టేషన్‌లోని పాదచారుల వంతెన వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళల పట్ల కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తించారు. చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ సాయం చేయాలని కోరుతున్న మహ

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (09:29 IST)
ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు స్టేషన్‌లోని పాదచారుల వంతెన వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళల పట్ల కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తించారు. చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ సాయం చేయాలని కోరుతున్న మహిళను అనుచితంగా తాకుతూ లైంగిక వేధింపులకుపాల్పడ్డారు. ఆ తర్వాత తమదారిన తాము పోయారు. ఇది జరిగిన కొద్ది క్షణాలకే ఆ మహిళ మృతి చెందింది. అలాగే, చనిపోయిన శవాలపై నగలు చోరీ చేశారు. ఈ దారుణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ తొక్కిసలాటలో 23మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఈ తొక్కిసలాటలో చిక్కుకుని కొనఊపిరితో బయటపడిన బాధితులకు ఆపన్నహస్తం అందించేలా చేస్తుంది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మృగాల్లా ప్రవర్తించారు. మహిళా క్షతగాత్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మరికొందరు దుర్మార్గులు చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 
 
ఈ దారుణ దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఎల్ఫిన్‌స్టోన్‌ ఘటనకు కారణమని, వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం