Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం కోసం వెళితే.. చేతులపై గోమూత్రం స్ప్రే చేశారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (10:44 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మాత్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే, ప్రైవేట్ సంస్థలు, ఐటీ కార్యాలయాలు, దేవాయల బోర్డులు కూడా ఈ తరహా నిబంధనలనే పాటిస్తున్నాయి. అయితే, కొందరు మరింతగా అతి జాగ్రత్తలకు వెళుతున్నారు. ఇలాంటివి వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఇస్కాన్ నిర్వాహుకులు కూడా ఇదే తరహా అతి చర్యలకు పాల్పడ్డారు. అల్పాహారం తినేందుకు వెళ్లిన కొందరి చేతులపై గోమూత్రం చల్లారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని జుహూ ప్రాంతంలో ఇస్కాన్ మందిరం ఉంది. ఈ ఇస్కాన్ పరిధిలో గోవిందా రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్‌కు ప్రతి రోజూ వందల సంఖ్యలో ముంబై వాసులు అల్పాహారం ఆరగించేందుకు వస్తుంటారు. 
 
ఈ క్రమంలో కరోనా వైరస్ పుణ్యమాని మందిరంలో శానిటైజర్ బాటిల్ పెట్టారు. ఈ రెస్టారెంట్‌కు వచ్చే వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుని వెళ్ళాలి. అయితే, ఈ శానిటైజర్ అయిపోయింది. ఈ కారణంతో, గోమూత్రంతో అక్కడికి వచ్చిన భక్తుల చేతులు శుభ్రం చేశారు. అదికూడా ఇస్కాన్ పరిధిలో ఉన్న గోవిందా రెస్టారెంట్ ప్రాంగణంలోనే ఈ తంతు జరిగింది. 
 
ఈ విషయాన్ని రాజూ నాయర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. తన స్నేహితునితో కలిసి ఇస్కాన్ ఆలయం  లోపల ఉన్న గోవిందా రెస్టారెంట్‌కు వెళ్లగా, తనిఖీల తర్వాత చేతులు చూపాలని చెప్పిన సిబ్బంది, దానిపై ఏదో స్ప్రే చేశారు. అది చాలా దుర్వాసనగా ఉన్నట్టు అనిపించగా, రాజు, ఏమిటని అడిగారు. దీనికి వారిచ్చిన సమాధానం విని అవాక్కయ్యాడు.
 
చెప్పకుండా గోమూత్రాన్ని చేతులపై స్ప్రే చేయడం ఏంటని నిలదీయగా, కొందరు దీన్ని తాగుతుంటారు కూడా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చారు. తనకు గోమూత్రంతో చేతులు కడుక్కోవడం ఇష్టం లేదని, తన వద్ద శానిటైజర్ ఉంటుందని, తాను ఆలయానికి వెళ్లలేదని, కేవలం రెస్టారెంట్‌కు తినేందుకే వెళ్లానని రాజూ నాయర్ చెప్పారు.
 
కానీ, ఇక్కడి రెస్టారెంట్‌లో తన మనోభావాలకు విరుద్ధంగా సిబ్బంది ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఈ విషయం వైరల్ కావడంతో ఆలయ అధికారి ఒకరు స్పందిస్తూ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయంలోని పలు చోట్ల శానిటైజర్లను ఏర్పాటు చేశామని, గోవిందా రెస్టారెంట్ వద్ద ఉన్న శానిటైజర్ అయిపోవడంతో, గోమూత్రాన్ని వినియోగించామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments