Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో డేటింగ్.. ఆపై గొంతుకోసి హత్య : ముంబైలో దారుణం

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (11:53 IST)
ముంబైలో దారుణం జరిగింది. 20 యేళ్ళ ప్రియురాలితో కొద్దికాలంపాటు డేటింగ్ చేసిన ప్రియుడు.. ఆమెతో విభేదాలు రావడంతో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం ముంబైలోని వాకేశ్వర్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వాకేశ్వర్ ప్రాంతానికి చెందిన కునాల్ బవదాని అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. అదే ఏజెన్సీలో 20 యేళ్ల యువతి పని చేస్తోంది. ఆమెపై మనసుపడిన కునాల్ ప్రేమ ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీనికి ఆమె సమ్మతించడంతో వారిద్దరూ డేటింగ్ చేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ప్రియురాలితో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆ ప్రియురాలు కునాల్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో మాట్లాడాలని చెప్పి కునాల్ తన మాజీ ప్రేయసిని బోరివలిలోని పార్కుకు పిలిపించి ఆమెను కత్తితో గొంతు కోశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. రక్తం ఓడుతూ ప్రేయసీ ప్రియులు పడి ఉండగా పోలీసులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments