Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న పిల్లని మంటల్లో వేసిన రాక్షసుడు...

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:43 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రాక్షసుడుగా మారిపోయాడు. హాయిగా నిద్రిస్తున్న పిల్లిని నిప్పుల్లో వేసి రాక్షసానందం పొందాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని భారతీ పార్క్ సమీపంలో ఉన్న నయా నగర్‌కు చెందిన సిద్ధేశ్ పటేల్ అనే వ్యక్తి.. సోమవారం అర్థరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. 
 
ఆ సమయంలో మెట్ల కింద కొన్ని పిల్లులు హాయిగా నిద్రిస్తున్నాయి. వాటిని చూడగానే ఈ రాక్షసుడుకి ఓ వింత ఆలోచన మొదలైంది. దీంతో వాటిని ఓ బాక్సులో వేసి నిప్పు పెట్టాడు. మంటలకు తాళలేక పరిగెడుతుంటే మళ్లీ వాటిని పట్టుకుని మంటల్లో వేశాడు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంటల్లో కాలిపోతుంటే వికృతానందం పొందాడు. 
 
అతను అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి అపార్ట్‌మెంట్ వాసులు ఈ దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ చర్యను జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments