Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరస్‌ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం ఎలా జరిగిందంటే..

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (08:13 IST)
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతడపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సమయంలో కారును ఓ లేడీ వైద్యురాలు నడుపుతున్నారు. రాంగ్ సైడ్‌లో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా, కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చొన్న సైరస్ మిస్త్రీతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై మహారాష్ట్ర పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
"ప్రమాదం జరిగినపుడు కారును ముంబైకు చెందిన ప్రముక వైద్యురాలు అనహిత పండోలే 120 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతున్నారు. ముందు సీట్లో ఆమె భర్త డారియస్ పండోలే, వెనుక సీట్లో సైరస్ మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూర్చొన్నారు. 
 
ఈ కారు పాల్ఘాట్ జిల్లాలోన చరోటీ వద్ద అనహిత పండోలే రాంగ్ సైడ్ నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో 120 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్న వారి కారు మెర్సిడెజ్ బెంజ్ కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనపై సైరస్ మిస్త్రీతో పాటు వెనుక సీట్లో కూర్చొన్న జహంగీర్ పండోలే కూడా మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అనహిత, ఆమె భర్త గాయాలతో బయటపడ్డారు" అని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments