Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై రైల్వే స్టేషన్.. ఫ్లాట్‌ఫామ్‌లోనే కాన్పు.. పోలీసులు ఏం చేశారంటే?

Mumbai
Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (14:27 IST)
ముంబై రైల్వే స్టేషన్‌లోనే ఓ మహిళ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పోలీసులే ఆ మహిళ కోసం లేబర్ రూమ్ సిద్ధం చేశారు. ఎలాగంటే..? 21 ఏళ్ల మహిళ ఎప్పుడూ బిజీ బిజీగా ముంబై రైల్వేస్టేషన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన పండంటి పాపకు జన్మనిచ్చింది. గీత దీపక్ వాఘ్రే ఆమె భర్త దాదర్ స్టేషన్‌లో పూణే వెళ్లేందుకు గాను వేచి వున్నారు. ఆ సమయంలో గీతకు పురిటి నొప్పులు వచ్చాయి. 
 
ఇక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు.. ప్రయాణీకులు బెడ్ షీట్లతో లేబర్ రూమ్‌లా నాలుగు వైపులా అడ్డుకట్టారు. భార్య వద్దే భర్త కూర్చుండి పోయాడు. కొందరు మహిళలు గీతకు ఫ్లాట్‌ఫామ్‌లోనే ప్రసవం చూశారు. 
 
ఈ క్రమంలో గీతకు పండంటి పాప పుట్టింది. కాన్పు జరగగానే పోలీసులు మహిళను, శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా వున్నారని పోలీసులు తెలిపారు. ఇదే విధంగా ఈ ఏడాది సెప్టెంబరులో 27 ఏళ్ల మహిళ భుసవాల్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్‌లోనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 30 ఏళ్ల మహిళ జూలైలో ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కవల పిల్లలకు రైలులోనే జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments