Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు.. బిట్ కాయిన్లలో డబ్బు కావాలంటా డెడ్‌లైన్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:13 IST)
అత్యంత రద్దీగా ఉండే దేశ వాణిజ్య రాజధాని ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టు ఫీడ్ బ్యాక్ ఇన్‌బాక్స్‌కు ఈ ఈమెయిల్‌ను అగంతకులు పంపించారు. ఇందులో తమకు బిట్ కాయిన్ రూపంలో నగదు చెల్లించాలంటూ ఇందుకోసం 48 గంటల పాటు డెడ్‌లైన్ విధిస్తున్నామని అందులో పేర్కొంది. పైగా, తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను పేల్చివేస్తామని ఆ అగంతకులు హెచ్చరించారు. 
 
తాము విధించిన గడువులోగా డబ్బు చెల్లించకపోతే మరో మెయిల్ పంపుతామని, ఆ తర్వాత కూడా తమ డిమాండ్ నెరవేర్చకపోతే టెర్మినల్-2ను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈమెయిల్ బెదిరింపుపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల ఇదే తరహా బెదిరింపు వచ్చిన విషయం తెల్సిందే. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకపోతే హత్య చేస్తామంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆతర్వాత రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన 19 యేళ్ల యువకుడిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments