Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు.. బిట్ కాయిన్లలో డబ్బు కావాలంటా డెడ్‌లైన్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:13 IST)
అత్యంత రద్దీగా ఉండే దేశ వాణిజ్య రాజధాని ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టు ఫీడ్ బ్యాక్ ఇన్‌బాక్స్‌కు ఈ ఈమెయిల్‌ను అగంతకులు పంపించారు. ఇందులో తమకు బిట్ కాయిన్ రూపంలో నగదు చెల్లించాలంటూ ఇందుకోసం 48 గంటల పాటు డెడ్‌లైన్ విధిస్తున్నామని అందులో పేర్కొంది. పైగా, తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను పేల్చివేస్తామని ఆ అగంతకులు హెచ్చరించారు. 
 
తాము విధించిన గడువులోగా డబ్బు చెల్లించకపోతే మరో మెయిల్ పంపుతామని, ఆ తర్వాత కూడా తమ డిమాండ్ నెరవేర్చకపోతే టెర్మినల్-2ను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈమెయిల్ బెదిరింపుపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల ఇదే తరహా బెదిరింపు వచ్చిన విషయం తెల్సిందే. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకపోతే హత్య చేస్తామంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆతర్వాత రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన 19 యేళ్ల యువకుడిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments