రెండో తరగతి చిన్నారికి బలవంతంగా కోడిగుడ్డు తినిపించిన టీచర్.. తర్వాత ఏమైంది?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఓ ఘటన జరిగింది. ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న శాఖాహార సామాజిక వర్గానికి చెందిన ఆరేళ్ల బాలికకు ఆ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు బలవంతంగా కోడిగుడ్డు తినిపించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజన పథకం కింద కోడిగుడ్డును తన కుమార్తెకు టీచరీ బలవంతంగా తినిపించాడని, దీంతో తన కుమార్తె తీవ్ర అస్వస్థతకు లోనైందని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము శాఖాహారులమని పాఠశాల యాజమాన్యానికి చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. 
 
పైగా, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కొడతామంటూ తన కుమార్తెను బెదిరించారని, తమ సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని చెప్పినా టీచర్ హేళనగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్ల ఈ ఘటనకు బాధ్యులైన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, బాలిక తండ్రి చేసిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు కూడా కొట్టిపారేశారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments