Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో తరగతి చిన్నారికి బలవంతంగా కోడిగుడ్డు తినిపించిన టీచర్.. తర్వాత ఏమైంది?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఓ ఘటన జరిగింది. ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న శాఖాహార సామాజిక వర్గానికి చెందిన ఆరేళ్ల బాలికకు ఆ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు బలవంతంగా కోడిగుడ్డు తినిపించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజన పథకం కింద కోడిగుడ్డును తన కుమార్తెకు టీచరీ బలవంతంగా తినిపించాడని, దీంతో తన కుమార్తె తీవ్ర అస్వస్థతకు లోనైందని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము శాఖాహారులమని పాఠశాల యాజమాన్యానికి చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. 
 
పైగా, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కొడతామంటూ తన కుమార్తెను బెదిరించారని, తమ సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని చెప్పినా టీచర్ హేళనగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్ల ఈ ఘటనకు బాధ్యులైన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, బాలిక తండ్రి చేసిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు కూడా కొట్టిపారేశారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments