Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో తరగతి చిన్నారికి బలవంతంగా కోడిగుడ్డు తినిపించిన టీచర్.. తర్వాత ఏమైంది?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఓ ఘటన జరిగింది. ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న శాఖాహార సామాజిక వర్గానికి చెందిన ఆరేళ్ల బాలికకు ఆ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు బలవంతంగా కోడిగుడ్డు తినిపించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజన పథకం కింద కోడిగుడ్డును తన కుమార్తెకు టీచరీ బలవంతంగా తినిపించాడని, దీంతో తన కుమార్తె తీవ్ర అస్వస్థతకు లోనైందని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము శాఖాహారులమని పాఠశాల యాజమాన్యానికి చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. 
 
పైగా, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కొడతామంటూ తన కుమార్తెను బెదిరించారని, తమ సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని చెప్పినా టీచర్ హేళనగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్ల ఈ ఘటనకు బాధ్యులైన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, బాలిక తండ్రి చేసిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు కూడా కొట్టిపారేశారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments