Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ యూజర్లకు జియో కొత్త ఆఫర్ - రూ.2,999కే యేడాది కాలపరిమితి...

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (12:58 IST)
ప్రీపెయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్‌తో ఒక యేడాది పాటు ఉచిత ఫోన్ కాల్స్‌ను అందిస్తుంది. అలాగే, రోజుకు 2.5 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది. అదేవిధంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఇవ్వనుంది. 
 
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5 బీజీ చొప్పున 5జీ డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, అజియో, రిలయన్స్ డిజిటల్ కూపన్లను కూడా అందజేస్తుంది. ముఖ్యంగా, జియో టీవీ సబ్‍స్క్రిప్షన్ కింద్ 14 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను చూడొచ్చు. 
 
ముఖ్యంగా, జీ5, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీలను చూడొచ్చు. 365 రోజుల పాటు కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments