Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసాం కామాఖ్యదేవీ ఆలయానికి ముఖేష్ అంబానీ దంపతులు 19 కిలోల బంగారం భారీ విరాళం

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:34 IST)
అసాం లోని కామాఖ్యదేవి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. తాజాగా ఈ ఆలయానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రముఖ రిలయన్స్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ దంపతులు భారీగా బంగారం విరాళంగా ఇచ్చారు. ఆలయగోపుర కలశాల తయారీ కోసం 19 కిలోల బంగారాన్ని ఇచ్చారు. ఈ బంగారంతో మూడు గోపుర కలశాలు రూపొందిస్తున్నట్లు కామాఖ్య ఆలయ వర్గాలు తెలిపాయి.
 
ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితమే బంగారం విరాళంగా ఇచ్చేందుకు అంబానీ దంపతులు కామాఖ్య ఆలయ వర్గాలకు సమాచారం అందించారు. అవే కాకుండా మూడు కలశాల బంగారు తాపడం ఖర్చులు కూడా తేమే భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరపున బంగారం అందించగా కలశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 
ఈ నిర్మాణ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేష్ అంబానీ వారి భార్య నీతా అంబానీ అస్సాంలో కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శనించనున్నా రు. దేశంలో గల శక్తి పీఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కామాఖ్య ఆలయం అస్సాంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments