Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడికి కరెంట్ బిల్లుతో షాక్ - నెలవారీ బిల్లు రూ.3149 కోట్లు

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:20 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఓ వృద్ధుడు కరెంట్ బిల్లు చూడగానే కరెంట్ షాక్‌కు గురైనట్టుగా అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు వచ్చిన నెలవారీ బిల్లును చూసిన దేశ ప్రజలు సైతం విస్తుపోతున్నారు. చిన్నపాటి ఇంటిలో ఉండే ఆ వృద్ధుడి ఇంటికి ఏకంగా రూ.3,149 కోట్ల మేరకు విద్యుత్ బిల్లు వచ్చింది. దీన్ని చూసిన ఆయన నోరెళ్ళబెట్టారు. ఈ బిల్లు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి సాక్షీభూతంగా నిలిచింది. 
 
బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల మేరకు... గ్వాలియర్‌లోని శివ్ విహార్ కాలనీలో ప్రియాంకా గుప్తా అనే కుటుంబ నివాసం ఉంటుంది. వీరికి జూలై నెల కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ప్రియాంకా గుప్తా మామ వృద్ధుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. నిజంగానే అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ బిల్లును చూడగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆ బిల్లును తీసుకెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు చూపించగా, వారు చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దారు. దీనిపై మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఈ తప్పు చేసిన ఉద్యోగిని గుర్తిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments