Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు... మరదలిని సజీవన దహనం చేసిన అన్న

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (08:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సొంత సోదరుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని మృతుడి అన్న జీర్ణించుకోలేక పోయాడు. మరదలు పెట్టిన వేధింపుల కారణంగానే తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన ఓ వ్యక్తి.. మరదలిని సజీవదహనం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి ఆర్నెల్ల కిందట ఆత్మహత్య చేసుకున్నడు. అతడి భార్య నిర్మల తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారి ఇంటివద్దే ఉంటున్నారు. అయితే, తమ్ముడి బలవన్మరణానికి నిర్మలే కారణమంటూ మృతుడి అన్న సురేశ్ ఆమెను వేధిస్తూ వచ్చాడు.
 
ఈ క్రమంలో శనివారం ఇనుపరాడ్డుతో ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత నిర్మలపై పెట్రోల్ పోసి నిప్పంటిండాు. "మీ సోదరికి నిప్పంటించాం" అని నిందితుడే మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. భర్త చావుకు తన సోదరే కారణమని, ఆమెను చంపేస్తానని సురేశ్ గతంలోనూ పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. దీంతో ఆమెను పుట్టింటికి తీసుకొచ్చేలోపు ఈ దారుణానికి తెగబడ్డాడని మృతురాలి సోదరుడు మీడియాతో వాపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి  విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments