Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్మెంట్ సొమ్మును పేద విద్యార్థుల చదువుకు దానం చేసిన ఉపాధ్యాయుడు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు 39 యేళ్లపాటు ఉద్యోగం చేసి పదవీ విరమణ ద్వారా వచ్చిన డబ్బునంతా పేద విద్యార్థుల చదువుకే ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఆశ్చర్యకర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ రాష్ట్రంలోని పన్నా జిల్లా, ఖాందియాకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి 39 యేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 
 
ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన చేసిన సర్వీసుకు రూ.40 లక్షల మేరకు సొమ్ము వచ్చింది. ఈ సొమ్మును ఆయన పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదీ కూడా తన భార్యాపిల్లల నిర్ణయం మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
 
 
 
తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని బాధలన్నింటినీ మనం తగ్గించలేమన్నారు. కానీ, మనం చేయాల్సిన కాసింత మంచినైనా చేద్దామన్నారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే తన సర్వీసు కాలంలో సంపాదించిన, పొదుపు చేసిన సమ్మును పేద విద్యార్థుల విద్యకే ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments