ఆగ్రహంతో జయంతి పిల్లలు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకొని నిద్రించింది. అదే సమయంలో బంటు తన గ్రామంలోనే మరో ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. బంటూ వచ్చే సరికి ఎలాంటి స్పందన లేదు. కొద్దిసేపటికే అక్కడ ఇరుగు పొరుగు వారు గుమికూడారు.
వారి సహాయంతో తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి చలించిపోయాడు. భర్త బంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు జయంతిని అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.