Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త క్షణికావేశం.. కోడలి నిండు ప్రాణాలు బలి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:23 IST)
అత్తాకోడళ్ల గొడవ యుగాలు గడిచినా మారేలా లేదు. తాజాగా ఓ అత్త క్షణికావేశం ఓ కోడలి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని సెరాయ్‌కేలా-ఖాస్వాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఝావ్రీ గ్రామానికి చెందిన భవానీ లాయెక్ (22), ఆమె అత్త గీతా లాయెక్ మధ్య ఆదివారం మధ్యాహ్నం గొడవ జరిగింది. ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. 
 
ఈ క్రమంలో ఆగ్రహం పట్టలేకపోయిన అత్త గీతా లాయెక్ గొడ్డలి తీసుకుని కోడలు భవానీ లాయెక్‌పై దాడికి పాల్పడింది. అయితే, గొడ్డలి తలపై బలంగా తగలడంతో భవానీ లాయెక్ అక్కడికక్కడే పడిపోయింది. 
 
ఇరుగుపొరుగు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భవానీ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొడవ జరిగినప్పుడు తాను విధులకు వెళ్లినట్లు అతను తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments