Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జార్ఖండ్‌లో పిడుగుపాటు.. 30 పశువులు మృతి

జార్ఖండ్‌లో పిడుగుపాటు.. 30 పశువులు మృతి
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:16 IST)
దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 30 పశువులు మృతి చెందాయి. గరంగ్ ఘాట్‌లో పిడుగు పాటుకు 22 పశువులు మృతి చెందగా, జమువాలో 8 పశువులు మృతి చెందాయి. 
 
పిడుగుపాటు ఘటనల్లో పశువులకు కోల్పోయిన వాటి యజమానులు తమకు నష్టపరిహారం అందజేయాలని అధికారులను వేడుకుంటున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేవరి పరిధిలోని గరంగ్‌ఘాట్‌లో కొందరు వ్యక్తులు పశులను మేత కోసం వదిలిపెట్టారు. 
 
ఇంతలో వాతావరణం ఒకసారిగా మారిపోయి పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఆవులు, గేదెలు, మేకలు మృతి చెందాయి. ఇదేవిధంగా జమువా పరిధిలో పడిన పిడుగుపాట్లకు పలు పశువులు మృతి చెందాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం - 2 రోజులు వర్షాలే వర్షాలు