ముందుగానే నిష్క్రమించిన రుతుపవనాలు - ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

ఠాగూర్
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (15:28 IST)
ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే నిష్క్రమించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ యేడాది దేశానికి సమృద్ధిగా వర్షాలను అందించిన ఈ నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే మూడు రోజుల ముందే వెళ్లిపోయాయని తెలిపింది. సాధారణంగా ఈ యేడాది సెప్టెంబరు 17వ తేదీ వరకు నైరుతి రుతపవనాలు కొనసాగాల్సి వుంది. కానీ, ఈ ప్రక్రియ మూడు రోజుల ముందుగానే మొదలు కావడం గమనార్హమని తెలిపింది. 
 
ఈ రుతుపవన సీజన్‌లో దేశ వ్యాప్తంగా అంచనాలకు మించి వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 14వ తేదీ మధ్యకాలంలో సాధారణంగా 790.1 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సివుండగా, ఈ యేడాది ఇది 846.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది సాధారణం కంటే ఏడు శాతం అధికమని వెల్లడించారు. 
 
ఒకవైపు, రుతుపవనాలు వెనుదిరుగుతుండగా, మరోవైపు, బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం  ఈ ఆవర్తనం ఈ నెల 20వ తేదీ నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అయితే, అది ఆ తర్వాత మరింత బలపడుతుందా లేదా అనే విషయంపై ఇపుడే స్పష్టత ఇవ్వలేమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments