Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు...(Video)

మేషం: బ్యాంకు పనుల్లో ఆలస్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్

Webdunia
మంగళవారం, 29 మే 2018 (16:37 IST)
దేశ ప్రజలకు చల్లని కబురు. ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రం నుంచి కొమరిన్ ప్రాంతం మొత్తం ఈ రుతుపవనాలు విస్తరించాయి.
 
కేరళలోని మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అల్లపుజ, కొట్టాయం, కొచి, త్రిశూర్, కోచికోడ్, కాన్నూర్, తలశెరి, కుడులు, మంగళూర్ ప్రాంతాల్లో 48 గంటల్లో 2.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ 14 ప్రాంతాల్లో పడిన వర్షపాతం ఆధారంగా భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు చెబుతున్నారు.
 
రుతుపవనాలు విస్తరణ ఈసారి చురుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూన్ 7, 8 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశించొచ్చు. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండటంతో అనుకున్న సమయం కంటే ఒకటి, రెండు రోజుల ముందుగానే రావొచ్చని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని అధికారులు అంటున్నారు. ఈ కారణంగా ఈ దఫా దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయని అంటున్నారు. వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments