Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రోజులు మోడీ మంత్రి వర్గ సమావేశం..ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:11 IST)
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినేట్‌ వర్గం మూడు రోజుల పాటు సమావేశాన్ని నిర్వహించనుంది. మంగళవారం నుండి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి.

మిగిలిన మూడు సంవత్సరాల పదవీకాలానికి సంబంధించి ఎజెండాను రూపొందించడానికి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రంపై ప్రజల కనబరుస్తున్న ఆగ్రహాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికల గురించి కూడా చర్చిస్తారని సమాచారం.

2014లో మోడీ ప్రధాని తొలిసారిగా పదవి చేపట్టిన నాటి నుండి చూస్తే... ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఆందోళనలు, కోవిడ్‌ మహమ్మారి వైఫల్యం, జీవన వ్యయం వంటి సమస్యలపై విమర్శలను ఎదుర్కోవడానికి కష్టపడుతోంది.

గత నెలలో, విమర్శల ప్రతిదాడిని ఎదుర్కొనేందుకు.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పేరుతో పలువురు కేంద్ర మంత్రులను తొలగించి... కొత్త వారికి పదవులు అప్పగించింది. రాబోయే పలు అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకుని కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది.

ఇటీవల కొత్త బాధ్యతలు చేపట్టిన మంత్రి వర్గంతో మంగళవారం నుండి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో మంత్రిత్వ శాఖ పనితీరును సమీక్షించి... నిర్ధేశిత లక్ష్యాలను చర్చిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments