Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్ హత్య కేసు.. కోరిక తీర్చలేదని.. అలా చేశాడట.. ఛార్జీషీట్?

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (11:53 IST)
మోడల్ హత్య కేసులో ముంబై పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు. కోరిక తీర్చలేదనే కసితో గొంతుకు తాడు బిగించి నిందితుడు చంపేశాడు. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గొప్ప మోడల్‌గా ఎదగాలనుకున్న వర్ధమాన మోడల్ మన్సీ దీక్షిత్ (20)ను నిందితుడు సయ్యద్ ముజమ్మిల్ (19) కోరిక తీర్చలేదనే అక్కసుతో హత్య చేశాడు. మోడల్‌తో పరిచయం పెంచుకున్న ఫొటోగ్రాఫర్ ముజమ్మిల్ ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఇందులో భాగంగా ఫొటోలు తీసే నెపంతో తన ఇంటికి పిలిచాడు. ఇంటికొచ్చిన ఆమెను తన కోరికను తీర్చాలన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన ఫోటోగ్రాఫర్... స్టూలుతో తలపై కొట్టాడు. ఆపై తాడుతో మెడను బిగించి చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి, క్యాబ్ బుక్ చేసుకుని ఓ ఫుట్ పాత్ వద్ద పడేసి పారిపోయాడు. 
 
కానీ ఆ సంచిలో మృతదేహం వుందని గమనించిన క్యాబ్ డ్రైవర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముజమ్మిల్‌ను అరెస్ట్ చేశారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఛార్జీషీట్ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments