Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడే ఆ పని చేశాడు.. టాయ్‌లెట్ కిటికీ నుంచి పసికందును?

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు సోదరుడైన సమీప బంధువు 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (11:22 IST)
మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు సోదరుడైన సమీప బంధువు 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది.

ఈ ఘటన ముంబై, వసాయి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వసాయి ప్రాంతంలోని ఓ పబ్లిక్ టాయ్‌లెట్ కిటికీ నుంచి అప్పుడే పుట్టిన చిన్నారిని కిందకు విసిరివేశారు. 
 
అయితే ప్రాణాపాయం నుంచి ఆ శిశువు తప్పించుకుంది. శిశువు ఏడుపు శబ్ధం విన్న స్థానికులు ఆ పసికందును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ శిశువు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో అత్యాచారం బాగోతం బయటపడింది. 
 
సోదరుడైన సమీప బంధువు మైనర్ బాలికపై పలుసార్లు అత్యాచారం జరపాడని.. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మైనర్ బాలిక, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments