Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం : బాలిక కిడ్నాప్.. రేప్.. ఆపై గొంతునులుమి చంపేశారు

రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (17:04 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి దారుణంగా చంపేశారు. ఈ ఘటన రాజధాని జైపూర్‌కు 340 కి.మీ దూరంలోని జలావర్‌ జిల్లాలో జరిగింది.
 
జలావర్ జిల్లాకు చెందిన ఓ బాలిక... ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ బాలిక ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఇంతలో పోలీసులు బాలిక మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురైందని.. అనంతరం గొంతునులిమి చంపేశారని శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. వెంటనే పోలీసులు ఫోరెన్సిక్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments