Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయిన మరో కేంద్ర మంత్రి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (09:03 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన్ను కలిసినవారిలో కేంద్రం మంత్రి బాబులు సుప్రియో కూడా ఉన్నారు. దీంతో ఆయన కీలక ప్రకటన చేశారు. అమితాషాను శనివారం సాయంత్రం తాను కలిశానని, ఈ నేపథ్యంలో వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులకు దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు బాబుల్ ట్వీట్ చేశారు. 
 
టెస్ట్ చేయించుకుని, రిజల్ట్ వచ్చేవరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోనున్నట్లు ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాగా, అమిత్‌షాకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఈయన గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అమిత్‌షాకు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం మేదాంత ఆసుపత్రికి చేరుకుని చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం బాగానే ఉంది. అయితే, తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments