Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్వారియా యాత్రలో విషాదం.. విద్యుదాఘాతానికి శివభక్తుల మృతి

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (10:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కన్వారియా యాత్రలో పాల్గొన్న ఐదుగురు శివ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. హైటెన్షన్ విద్యుత్ తీగలు తలగడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన మీరట్ జిల్లాలో జరిగింది.
 
కాన్వార్ యాత్రలో పాల్గొన్న భక్తులు హరిద్వార్‌లో పవిత్ర గంగా జలాలను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. భజనలు చేసుకుంటూ వస్తున్న వీరి వాహనం మీరట్ జిల్లాలోని భావన్‌పుర్‌లోని రాలీ చౌహాన్‌ గ్రామ సమీపానికి చేరగానే.. తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది.
 
దీంతో వాహనం సమీపంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు స్థానికులు.. పవర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సిందిగా కోరే లోపే.. ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలిచారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments