Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొలంలో పనిచేస్తుండగా కరెంట్ షాక్.. ముగ్గురు రైతులు మృతి

పొలంలో పనిచేస్తుండగా కరెంట్ షాక్.. ముగ్గురు రైతులు మృతి
, శుక్రవారం, 28 అక్టోబరు 2022 (18:29 IST)
ఏపీలోని కడప జిల్లాలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ముందుగా ఒక రైతు పిచికారి చేస్తుండగా అతడికి కరెంట్‌ షాక్ తగిలింది. 
 
అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి కూడా షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలి వేదికగా భేటీకానున్న భారత్ - బ్రిటన్ ప్రధానులు